జగన్‌ నిర్ణయంపై రాజశేఖర్ హర్షం..

జగన్‌ నిర్ణయంపై రాజశేఖర్ హర్షం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై సినీహీరో డా.రాజశేఖర్ ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు తీసుకున్న నిర్ణయం పూర్తిగా సరైందే. ఆధునిక ప్రపంచంలో ఉద్యోగాలు పొందాలన్నా, ఇతరులతో సంభాషించాలన్నా ఇంగ్లిష్ భాషే ముఖ్యం. ఇంగ్లిషు రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు తమ ఉన్నత చదువుల్లో, ఉద్యోగాలు తెచ్చుకోవడంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు’ అని ట్వీట్ చేశారు. ఈ సమస్యలకు జగన్ తీసుకున్న నిర్ణయం ముగింపు పలుకుతుందని. నేను ఈ నిర్ణయానికి పూర్తిగా మద్దతు పలుకుతున్నాను. అలాగే, మన మాతృభాష తెలుగును కూడా తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్ గా ఉంచాలని నేను భావిస్తున్నాను. సమాజంలోని అందరికీ విద్య సమానంగా అందాలి’ అంటూ ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos