రజనీకి పట్టం ఖాయం : సోదరుని విశ్వాసం

హొసూరు : తమిళనాడులో 2021లో జరిగే శాసన సభ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు రజనీకాంత్‌కు పట్టం కడతారని ఆయన సోదరుడు సత్యనారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణగిరి జిల్లా కావేరి పట్నంలో జరిగిన కార్యక్రమాలకు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు.

2021లో ఎన్నికల్లో రజనీకాంత్‌ పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ఆయన దీనిపై ప్రకటన చేస్తారని చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఆయన రాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి రజనీ తన వంతు కృషి చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు చేట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఆయన గెలుపునకు దోహదపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos