తొరపల్లిలో రాజాజీ జయంతి

తొరపల్లిలో రాజాజీ జయంతి

హోసూరు : తొలి, చివరి భారతీయ గవర్నర్ జనరల్, స్వాతంత్య్ర సమర యోధుడు రాజాజీ 142వ జయంతి వేడుకలను ఆయన పుట్టిన గడ్డ తొరపల్లి గ్రామంలో వైభవంగా నిర్వహించారు. కృష్ణగిరి జిల్లా కలెక్టర్ జయచంద్ర భాను రెడ్డి, హోసూరు ఎమ్మెల్యే ఎస్.ఎ. సత్య, హోసూరు యూనియన్ చైర్‌పర్సన్‌ శశి వెంకటస్వామి, వివిధ పార్టీల నాయకులు తొరపల్లి గ్రామంలోని రాజాజీ నివాసానికి చేరుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా దేశం కోసం రాజాజీ చేసిన సేవలు మరువలేమని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని నాయకులు ఉద్బోధించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు తొరపల్లి గ్రామంలో రాజాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos