తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలోనే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos