8 నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.

8 నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.

విశాఖ పట్టణం: ఈనెల 5న దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి 7న వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో 8, 9వ తేదీల్లో వర్షాలు పడతాయని తెలిపింది. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు జోరుగా వరి కోతలు సాగుతున్నాయి. వర్షం పడితే పంట నాశనం అయిపోతుంది. దీంతో వర్ష సమాచారం కోసం రైతులు విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రానికి ఫోన్లు చేసి వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. 5న అల్పపీడనం ఏర్పడిన తర్వాత కానీ వర్షాల రాక పై స్పష్టత రాదని పేర్కొన్నారు. తూర్పు గాలుల ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కాగా, మూడు నెలల కాలానికి గాను భారత వాతావరణ శాఖ నిన్న విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఏపీలో ఈ నెల నుంచి ఫిబ్రవరి వరకు చలి తీవ్రంగా ఉంటుంది. ఏపీ, తెలంగాణ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos