18న దేశవ్యాప్త రైల్‌రోకో

18న దేశవ్యాప్త రైల్‌రోకో

లఖీంపూర్ ఖేరి : లఖింపూర్ ఖేరీ ఘోరానికి కారణమైన కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాలని, రైతులను వాహనంతో తొక్కించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయక పోతే ఈ నెల 18న దేశ వ్యాప్తంగా రైల్ రోకో చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా కేంద్రాన్ని హెచ్చరించింది. ఈ నెల 12న రైతు యోధుల దినోత్సవం (షహీద్ కిసాన్ దివస్) నిర్వహిస్తామని తెలిపింది. రైతులు అమరులైన తికోనియాలో సంస్మరణ సభ నిర్వహిస్తామని తెలిపింది. రైతు సంఘాలు, రైతులు ఆ రోజున సంస్మరణ సభలు నిర్వహించాలని, అన్ని మతాల వారు ప్రార్థనలు నిర్వహించాలని, అమరులు శ్రద్ధాంజలి ఘటించాలని విజ్ఞప్తి చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos