‘గాంధీ సిద్ధాంతాలు చెప్పడం సులువే.. పాటించడమే కష్టం’

బదనవాళు: గాంధీ సిద్ధాంతాలను వల్లించడం కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి సులభంగానే ఉంటుంది కానీ, ఆయన అడుగు జాడల్లో నడవడం మాత్రం కష్టమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్ర పేరిట సుదీర్ఘ పాదయాత్రను కొనసాగిస్తున్న రాహుల్ 1927లో కర్ణాటకలోని బదనవాళు గ్రామంలో గాంధీ సందర్శించిన ఖాదీ గ్రామోదయ కేంద్రంలో నివాళులు అర్పించారు. “దేశం కన్న గొప్ప వ్యక్తిని గుర్తుచేసుకుంటూ నేడు నివాళి అర్పిస్తున్నాం. అహింస, ఐకమత్యం, సమానత్వం, న్యాయం అని గాంధీ చెప్పిన మార్గంలో నడుస్తూ.. భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్నాం. బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా గాంధీ పోరాడినట్లుగానే.. మహాత్ము డిని చంపిన సిద్ధాంతంపై మేము కూడా యుద్ధాన్ని ప్రకటించాం. అదే సిద్ధాంతం గడిచిన ఎనిమిదేళ్లుగా దేశంలో అసమానత్వం, విభజనవాదాన్ని వ్యాప్తి చేస్తుండడంతో పాటు కష్టపడి సంపాదించుకున్న మన స్వేచ్ఛను హరిస్తోంది. హింసా రాజకీయాలు, అసత్య ప్రచారాలు కొనసాగుతున్న వేళ.. వాటికి వ్యతిరేకంగా గాంధీజీ చెప్పిన సందే శాన్ని భారత్ జోడో యాత్రలో ప్రచారం చేస్తాం” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos