అమరావతి:నివాసానికే పరిమితమైన ముఖ్యమంత్రి జగన్ కు బదులుగా తనను వైకాపా శ్రేణులు అదే పనిగా ఎన్నికల తర్వాత తను నియోజక వర్గంలో కనిపించడం లేదనే పోస్టుల్ని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నాయని లోక్సభ సభ్యుడు రఘు రామ కృష్ణ రాజు వ్యాఖ్యానించారు. ‘నన్ను నియోజకవర్గానికి వెళ్లేలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడకు వెళ్లగానే నన్ను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నా గురించి కామెంట్లు చేస్తున్న వారు ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడటం లేదు. వ్యక్తి గత అవసరాల కోసం ఢిల్లీకి తిరుగుతూ మిగిలిన సమయాల్లో బయటకే రాని వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడటం లేద’ని ముఖ్యమంత్రి గురించి తప్పు బట్టారు. క్రిస్మస్ కి ముందే నియోజకవర్గానికి వెళతానని ప్రకటించారు.