హొసూరు : కృష్ణగిరి జిల్లా సూలగిరి సమీపంలోని డ్యాం ఎబ్బలమ్ గ్రామంలో రోడ్డుపైకి వచ్చిన పది అడుగుల కొండ చిలువను గ్రామస్థులు పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. రోడ్డు పక్కన నిలిచి ఉన్న ద్విచక్ర వాహనాల కిందకు చేరిన కొండ చిలువను స్థానికులు గమనించి, మళ్లీ అడవిలో వదిలేశారు. ఈ గ్రామంలోకి తరచూ కొండ చిలువలు రోడ్డుపైకి వస్తున్నాయని స్థానికులు తెలిపారు. సమీపంలో అటవీ ప్రాంతం ఉండడం వల్ల ఇలా జరుగుతోందన్నారు.