పంజాబ్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం

  • In Sports
  • October 7, 2021
  • 103 Views
పంజాబ్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం

దుబాయ్: 135 పరుగుల స్వల్స లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు అదరగొట్టింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (42 బంతుల్లో 98 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ జట్టు కేవలం 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. రాహుల్ వరుస సిక్సర్లతో చెన్నై బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడడంతో మరో 42 బంతులు మిగిలుండగానే పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. సీఎఎస్‌కే బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా, దీపక్ చాహర్‌కు ఓ వికెట్ దక్కింది. ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా గురువారం టాస్ గెలిచిన పంజాబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos