పేటీఎంనూ నిషేధించాలి.

పేటీఎంనూ నిషేధించాలి.

చెన్నై: చైనా పెట్టుబడులు ఉన్నదేశీయ యాప్ పేటీఎంను కూడా నిషేధించాలని తమిళనాడు పార్లమెంటు సభ్యుడు మాణిక ఠాగూర్ మంగళవారం ట్వీట్ లో ప్రధాని మోదీని డిమాండ్ చేసారు. చైనాకు చెందిన 59 యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించటాన్ని స్వాగతించారు. ‘పేటీఎంలో చైనా కు చెందిన బహుళ జాతి సంస్థలైన యాంటీ ఫైనాన్షియల్స్ నుంచి 29.71 శాతం, అలీబాబా గ్రూప్ నుంచి 7.18 శాతం పెట్టుబడులు ఉన్నాయని సంబంధిత స్క్రీన్ షాట్లను జత పరిచారు. చైనా సంస్థలయిన అలీబాబా, యాంట్ ఫైనాన్షియల్స్ కూడా చైనాకు చెందిన బహుళజాతి సంస్థలేనని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos