హైదరాబాదు : జనసేనలో చేర బోతున్నట్టు ప్రముఖ టాలీవుడ్ కమెడియన్, పృథ్వి శనివారం ఇక్కడ ప్రకటించారు. జనసేన నేత, నాగబాబును కలిసిన తర్వాత విలేఖ రులతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్ష ముగియగానే ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో పృథ్వి జనసేన కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో స్వస్థలం తాడేపల్లిగూడెం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి పృథ్వి పూర్తి స్థాయిలో ప్రచారాన్ని చేసారు. ఆయన ఎస్వీబీసీ ఛైర్మన్ గా చేశారు. అయితే, ఓ మహిళతో రాసలీలలు నడిపించారనే ఆరోపణలతో ఆయనను పదవి నుంచి తొలగించారు.