లాభాల్లో ముగిసిన మార్కెట్లు

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాలతో గట్టెక్కాయి. కరోనా మళ్లీ పెరుగుతుండటంతో, మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయనే భయాలతో మార్కెట్లు తొలుత నష్టాల్లోకి జారుకున్నాయి. ఊహించిన దానికంటే ముందుగానే కరోనా వ్యాక్సిన్ వస్తుందనే అంచనాలతో మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 44,077 వద్ద, నిఫ్టీ 67 పాయింట్లు పుంజుకుని 12,926 వద్ద ఆగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఓఎన్జీసీ (6.84%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.79%), ఇన్ఫోసిస్ (3.37%), టెక్ మహీంద్రా (2.98%), టీసీఎస్ (2.42%)లాభాల్ని గడించింది. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-3.55%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.48%), యాక్సిస్ బ్యాంక్ (-1.99%), టైటాన్ కంపెనీ (-1.74%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.69%) నష్ట పోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos