ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది గంటల ప్రాంతంలో బీఎస్ఈ-సెన్సెక్స్ 330 పాయింట్లకుపైగా లాభంతో 43,968 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ దాదాపు 90 పాయింట్లు పెరిగి 12,867 వద్ద ఉన్నాయి. మెడార్నా టీకా 94.5 శాతం విజయవంతమైనట్లు ప్రకటన వెలువడటం అంతర్జాతీయంగా విపణుల సానుకూలతలు పెంచింది. మదుపరులు కొనుగోళ్లపై దృష్టి సారించటం లాభాలకు కారణం. టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఎం&ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో, హెచ్సీఎల్టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఆటో, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.