నన్ను బయటకు పంపి పైశాచికానందం పొందారు..

నన్ను బయటకు పంపి పైశాచికానందం పొందారు..

మహిళా ఉద్యోగితో ఫోన్‌లోనే రాసలీలలు జరిపాడని,పవిత్రమైన తిరుమల కొండపైనే మద్యం సేవించాడని తదితర ఆరోపణలతో ఎస్‌వీబీసీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన సినీనటుడు,వైసీపీ నేత పృథ్వీరాజ్‌ మరోసారి ఆరోపణలపై స్పందించారు. కుట్రపూర్వితంగా తనను ఎస్వీబీసీ నుంచి తప్పించారని, తనను బయటకు పంపి కొందరు పైశాచికానందం పొందారని చెప్పారు. దీంతో తాను కొన్ని రోజులుగా తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలిపారు.కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను అమలు చేస్తామని  హామీ ఇచ్చినందుకే తనపై కుట్ర పన్నారని పృథ్వీరాజ్ఆరోపించారు. తాను సజ్జల, వైవీ, విజయసాయిరెడ్డిలకు మాత్రమే తాను జవాబుదారిగా ఉంటానని చెప్పారు. నిరసనలు తెలుపుతున్న అమరావతి రైతులపై తాను చేసినపెయిడ్ఆర్టిస్టులువ్యాఖ్యలపై స్పందించారు.  రాజధాని రైతులను కించపరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని చెప్పుకొచ్చారు. తాను ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos