ముంబై: సంఘ్ పరివార్, భాజపా చేతుల్లో అధికారాన్ని ఉంచడానికే మహారాష్ట్రలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసారని శివసేన అధికారిక పత్రిక-సామ్నా ఆరోపించింది. రాష్ట్రపతి పాలన విధించాలనే నిర్ణయం వెనుక ఒక కనిపించని శక్తి ఉందని పేర్కొంది. అదే గవర్నర్ ను ఒప్పించేలా భాజపా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు మార్గనిర్దేశం చేసిందని వివరించింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించటం దురదృష్టకరమని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించింది. రాజకీయ అస్థిరత్వంతో మహారాష్ట్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుందని ఫడ్నవిస్ చెప్పినవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించింది. రాష్ట్రపతి పాలన విధించాలనే స్క్రిప్టును ఎప్పుడో రాసే శారని మండిపడింది.