న్యూ డిల్లీ: మెదడు శస్త్ర చికిత్స చేయించుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉండటంతో కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ మంగళవారం ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను సమాచారం అడిగి తెలుసుకున్నారు. ప్రణబ్ కు కరోనా కూడా సోకడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు. ‘నేను ఆర్మీ ఆసుపత్రిని సందర్శించాను. ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాన’ని రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ లో వెల్లడించారు.