కడప: కరోనా నివారణకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మందులు సూచించారని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తల్ని ఆలయ మేనేజర్ ఈశ్వరయ్యచారి శనివారం ఖండించారు. ‘ఆలయంలో పూజారి చనిపోయాడని వస్తున్న వార్త అవాస్తవం. మిరియాలు, అల్లం, బెల్లం కలిపిన నీటిని తాగితే కరోనాను నివారించవచ్చని బ్రహ్మంగారు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదు. అసత్య వార్తలను ప్రజలు నమ్మవద్దు. ఇలాంటి కథనాలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. దీనిపై రాష్ట్ర డీజీపీ, కడప ఎస్పీకి ఫిర్యాదు లేఖలు పంపామ’ని తెలిపారు.