జనాభా తగ్గుదల మొదలైంది

జనాభా తగ్గుదల మొదలైంది

న్యూ ఢిల్లీ: భారత్లో గత కొన్నేళ్లుగా జనాభా తగ్గుముఖం పడుతోందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 తాజా గణాంకాలు వెల్లడించాయి. 2019-21లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. దేశ సంతానోత్పత్తి రేటులో ఇప్పటి వరకు నమోదైన అత్యల్ప స్థాయి ఇది. అంతేగాక తొలిసారిగా సంతానోత్పత్తి రేటు రీప్లేస్మెంట్ రేటు కంటే దిగువకు పడిపోవడం ఓ మైలురాయి అని సర్వే చెబుతోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ ఐదో సర్వేను 2019-21లో నిర్వహించారు. దేశంలో సంతానోత్పత్తి రేటు 2గా ఉంది- అంటే 2019-21లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.2015-16లో నిర్వహించిన నాలుగో సర్వేలో సంతానోత్పత్తి రేటు 2.2 శాతంగా ఉండగా.. ఇప్పుడు మరింత తగ్గింది. రీప్లేస్మెంట్ రేటు అంటే జనాభాలో ఎటువంటి తగ్గుదల, పెరుగుదల ఉండకపోవడం. అంటే దేశంలో జనన, మరణాలను సమ తుల్యం చేసే స్థాయి. దేశంలో సంతానోత్పత్తి రేటు కంటే తక్కువగా ఉండటం వల్ల జనాభా తగ్గుదల మొదలైంది. 1998-99లో సంతానోత్పత్తి రేటు 3.2. అప్పట్లో సగటు భారతీయ మహిళ తన జీవితకాలంలో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. 2019-21లో ఐదు రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల సంతానోత్పత్తి రేటు 2 అంత కంటే తక్కువగానే ఉంది. బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, మణిపుర్లో మాత్రం ఇది ఇంకా రీప్లేస్మెంట్ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఉత్తర్ప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు 2.4, బిహార్లో 3. అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉన్న రాష్ట్రం సిక్కిం. టీఎఫ్ఆర్ రేటు 1.1.లద్దాక్లో ఐదేళ్లలో గణనీయంగా తగ్గి 1.3కు చేరిన సంతానోత్పత్తి రేటు.అండమాన్ నికోబార్, గోవాల్లోనూ బర్త్ రేటు 1.3గా ఉంది. .దేశంలో బాల్యవివాహాలు గతంలో కంటే తగ్గినప్పటికీ ఇప్పటికీ ప్రతి నలుగురు ఆడపిల్లల్లో ఒకరికి 18 ఏళ్లు నిండకుండానే వివాహం జరుగుతోంది. 18 ఏళ్లు నిండకుండానే వివాహం చేసుకొనే వారి సంఖ్య 2019-21లో 23.3 శాతం. ఐదేళ్ల క్రితం ఇది 26.6 శాతం. కుటుంబ నియంత్రణ సాధనాలు వాడే వారి సంఖ్య 54 నుంచి 67 శాతానికి పెరిగింది.ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించట్లేదని సర్వే స్పష్టం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos