భారత్ జోడో యాత్ర లో మెరిసిన బాలీవుడ్ తార

భారత్ జోడో యాత్ర లో మెరిసిన బాలీవుడ్ తార

హైదరాబాదు : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు తెలంగాణలో భారీ స్పందన వస్తోంది. బుధవారం హైదరాబాద్ కూకట్పల్లి, జేఎన్టీయూ మీదుగా రాహుల్ పాదయాత్ర సాగుతోంది. బాలీవుడ్ హీరోయిన్, చిత్ర నిర్మాత పూజా భట్ జోడో యాత్రలో తళుక్కున మెరిసింది. ఆమె రాహుల్తో కలిసి కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. కార్యకర్తలను ఉత్సహాపరిచారు. యాత్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్తో ఆమె కాసేపు ముచ్చటించి వెళ్లారు. గత వారం రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. గత నెల 29న రాహుల్ పాదయాత్రలో నటి పూనమ్ కౌర్ కూడా యాత్రకు హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారుల నుంచి భారీ స్పందన వస్తుంది. నారాయణపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలను కవర్ చేసిన యాత్ర తెలంగాణలో ఏడో రోజు యాత్ర హైదరాబాద్లోకి ప్రవేశించింది. నేడు రాహుల్ ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నగర శివార్లలోని శంషాబాద్లోని మఠం ఆలయం నుండి పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos