దిశ నిందితుల ఎన్కౌంటర్ సుప్రీంకోర్టుకు చేరింది.పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.2014లో ఎన్ కౌంటర్ విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గ దర్శకాలను పోలీసులు పాటించలేదని వారు అందులో పేర్కొన్నారు.గత నెల 28వ తేదీన చటాన్పల్లి సర్వీస్ రోడ్డు బ్రిడ్జి కింద పెట్రోల్ పోసి దిశను దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో చర్లపల్లి కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న లారీ డ్రైవర్లు మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్న కేశవులు, క్లీనర్లు జొల్లు శివ, జొల్లు నవీన్లను శుక్రవారం సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేయగా దీనిపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్త్మవుతుండగా కొంతమంది ‘మేధావులు’ మాత్రం విమర్శలు చేస్తూ రాద్ధాంతం చేస్తున్నారు..