ముంబై : ‘ఆత్మ గౌరవం ఉన్నవారెవరూ ఆ పదవిలో కొనసాగర’ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోమవారం గవర్నర్ కోషియారీకి చురకలంటించారు. గవర్నర్ రాసిన లేఖలో వాడిన భాష సరికాదని సాక్షాత్తూ హోం మంత్రి షా కూడా అన్నారని గుర్తు చేశారు. ‘లేఖలో వాడిన భాష సరికాదని హోంమంత్రి చేసిన ప్రకటన తరువాత ఆత్మగౌరవం ఉన్న ఎవరైనా ఆ పదవిలో కొనసాగాలా? వద్దా? అని ఆలోచిస్తార’ని ఎద్దేవా చేశారు.