వైభవంగా పవిత్రోత్సవాలు

వైభవంగా పవిత్రోత్సవాలు

హొసూరు : ఇక్కడికి సమీపంలోని చప్పడి గ్రామంలో ప్రసిద్ధి చెందిన ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో 12వ ఏట పవిత్రోత్సవాలను అతి వైభవంగా నిర్వహించారు. చప్పడి గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏటా కార్తీక మాస పూజలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఆలయంలో స్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహించారు. పవిత్రోత్సవాలలో భాగంగా ఆలయంలోని పరివార దేవతలకు అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. తరువాత ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామికి వివిధ రకాల అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపారు. చివరగా స్వామివారికి మహా మంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos