శ్రీకాకుళం : మంత్రి ధర్మాన ప్రసాదరావు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు. తనకు ఇప్పుడు 64 ఏళ్లని, పవన్ తనతో పాటు నడవగలరా? అన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని పవన్ గ్రహించాలన్నారు. లింగాలవలస గ్రామంలో సోమవారం ధర్మాన ‘గడపగడపకు…’ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో కనిపించిన పవన్ కల్యాణ్ కుడ్య పత్రంలో స్థానిక యువకుల ఫొటోలూ ఉన్నందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సిని మాలో బొమ్మలతో నటిస్తారు. పవన్ నడుస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చేశారు. నాతో నడవమనండి కనీసం మూడు కి.మీలూ నడవలేరు. మాటలు చెప్పినంత సుల భంగా ఏమీ ప్రజా జీవితం ఉండద’ని వ్యాఖ్యానించారు. అధికారం, పదవులు పట్టించు కోకుండా నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నానని వెల్లడించారు.