రెండు టెస్టులు,మూడు టీ20 సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓ భారతీయ క్యాబ్ డ్రైవర్కు విందు ఇచ్చింది. మొదటి టెస్టు కోసం బ్రిస్బేన్ వెళ్లిన పాకిస్థాన్ జట్టులోని ఐదుమంది సభ్యులు ఇండియన్ రెస్టారెంట్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో క్యాబ్ ఎక్కగా భారతీయుడైన క్యాబ్ డ్రైవర్ వారిని రెస్టారెంట్కు తీసుకెళ్లాడు.అయితే రెస్టారెంట్కు చేరుకున్న అనంతరం ఆ డ్రైవర్ క్రికెటర్లపై గౌరవంతో డబ్బులు తీసుకోలేదు.దీందో ఆశ్చర్యానికి గురైన ఆ క్రికెటర్లు క్యాబ్ డ్రైవర్ ను తమతో పాటు రెస్టారెంట్ కు తీసుకెళ్లి విందు ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ డ్రైవర్ ఓ రేడియో వ్యాఖ్యాతకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.