అమరావతి : కేంద్ర ప్రభుత్వ ఇటీవల ప్రకటించిన మూడో విడత ఆర్థిక పథకం వల్ల సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తుల ప్రయోజనం కోసమే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. బీజేపీ ప్రకటనలు, ప్యాకేజీలు బీజేపీ పాలిత రాష్ట్ర లలో సామాన్యలకూ ఉపయోగపడవు. కరోనా వల్ల దేశ వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి కోల్పోయిన వారికి ఏమి ప్రయోజనం లేదు. చిన్న, సన్నకారు రైతులు,వ్యాపారుల్ని మోదీ సర్కార్ గాలికి వదిలేసింది. గ్రామీణ పేదలు, వలస కార్మికులను దృష్టిలో పెట్టుకుని సహాయ పథకం ఉండాల’న్నారు.