పారి పోయిన ఓవైసీ

పారి పోయిన ఓవైసీ

హైదరాబాదు : ఇక్కడి జాంబాగ్ డివిజన్లో జీహెచ్ఎంసీ ఎన్నిక ప్రచారానికి వెళ్లిన మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పై మగువలు సోమవారం మండి పడ్డారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగర వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరికే ప్రభుత్వం సాయం అందింది. ‘ వరద సహాయం మాకు అందలేదు. కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోని మీరు ఇప్పుడు ఓట్ల కోసం వచ్చార’ని నిలదీశారు. దీంతో ఒవైసీ వెంటనే అక్కడి నుంచి వెను దిరిగారు. ఎంఐఎం 52 స్థానాల్లో పోటీ చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos