ప్రజావాహిని – బెంగళూరు
ఆన్లైన్ జూద నిషేధ ముసాయిదాను హోం మంత్రి శుక్ర వారం విధాన సభలో ప్రవేశ పెట్టారు. దీనిపై ఇంకా చర్చ జరగాల్సి ఉంది. దీన్ని ఉల్లంఘించిన వారికి మూడేళ్ల వరకూ చెరసాల శిక్ష, రూ. లక్ష వరకూ జరిమానా ఉంటుంది. తొలి సారి పట్టుబడితే రూ. ఆరుమాసాల చెరసాల శిక్ష, రూ.పదివేల జరిమాన; రెండో సారి నేరానికి పాల్పడితే రూ. పదహైదు వేల జరిమానా, ఏడాది చెరసాల శిక్ష, మూడో సారి పట్టుబడితే ఏడాదిన్నర కారాగార శిక్ష, రూ. ఇరవై వేల జరిమానా విధిస్తారు. ఆన్లైన్ జాదాన్ని నిర్వహించే వారినే కాకుండా అందుకు భవనాన్ని అద్దెకు ఇచ్చిన యజమానినీ నేరగాళ్లుగా పరిగణిస్తారు.