హోసూరు : శ్రీ చంద్ర చూడేశ్వర స్వామి రథోత్సవ ఏర్పాట్లు శర వేగంగా సాగుతున్నాయి. మార్చి 9వ న జరగనున్న స్వామి వారి రథో త్సవానికి వారం రోజుల కిందట ధ్వజా రోహణ చేసి పనులు ప్రారంభించారు. ఇక్కడి తేరుపేటలోని చిన్న, పెద్ద రథాల అలంకరణకు 20 మంది కార్మికులు పని చేస్తున్నారు. హోసూరు మాజీ శాసనసభ్యుడు కెఎ మనోహరన్ గురువారం రథాలంకరణ పనుల్ని పరిశీలించారు. ఆయన వెంట డీఎంకే నాయకులు గోపాల్ హోసూరు యూనియన్ కౌన్సిలర్ సంపత్, స్థానిక పెద్దలు ఉన్నారు.