ఈక్వెడార్:ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిలో కైలాసం నిర్మాణం పూర్తయిందని స్వయం ప్రకటిత దైవ స్వరూపుడు స్వామి నిత్యానంద సామాజిక మాధ్యంలో ప్రకటన విడుదల చేసారు. ఇకపై తాను తమిళనాడుకు రానని తేల్చి చెప్పాడు. తాను మరణించిన తర్వాత భౌతికకాయాన్ని బిడది శ్రమంలో ఖననం చేయాలని కోరాడు. ఇదే తన చివరి కోరిక అని అన్నాడు. బాలికల అపహరణ, వేధింపులపై తనపై కొందరు కేసులు పెట్టడంతో భయపడిపోయిన నిత్యానంద విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నాడు. అతడి ఆచూకీ కోసం ఇప్పటికే ఇంటర్పోల్ నోటీసులు జారీ చేసింది.