హైదరాబాదు: మహిళ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవితం ఆధారంగా నిర్మించదలచిన చిత్రంలో ఆమె పాత్ర పోషించేందుకు విశిష్ట నటి నిత్య మీనన్ నిరాకరించినట్లు సినీ వర్గాల కధనం. ఎంవీవీ సత్యనారాయణ, ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాతలు. దీనికి సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఆమె తిరస్కరణకు కారణాలు తెలియరా లేదు. మరో నాయిక కోసం ప్రయత్నిస్తున్నారు.