నితీష్ గెలుపు – రాష్ట్రం ఓటమి

నితీష్ గెలుపు – రాష్ట్రం ఓటమి

పట్నా : ముఖ్య మంత్రి నితీష్ కుమార్ది అవినీతి పాలన అని ఎల్జెడి నేత చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే అవినీతిలో ప్రమేయం ఉన్న వారందరినీ జైలుకు పంపస్తామని గురువారం వరుస ట్వీట్ లలో పేర్కొన్నారు. ‘రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం నిజాయితీగా ఉండాలి. గత ఐదేళ్లలో నితీస్కుమార్ పాలనలో ప్రభుత్వ యంత్రాగం, ఏడు వాగ్దానాలు (సాత్ నిశ్చరు)లో అవినీతిలో కూరుకుపోయాయి. బీహార్లో మార్పు కోసం ప్రజలు ఓట్లు వేయాలి. నితీష్ కుమార్ను ఓడించాలి. ఈ ఎన్నికల్లో నితీష్ కుమార్ పొరపాటున గెలిస్తే రాష్ట్రం ఓడిపోతుంది. రాష్ట్రాన్ని అవినీతి మయం చేస్తార’ని ధ్వజమెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos