ఆడవారిని అవమానించిన నితీశ్

ఆడవారిని అవమానించిన నితీశ్

పాట్నా : లాలూ కుటుంబంపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఆర్జేడీ యువనేత తేజస్వీ సూర్య తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీపై కూడా విరుచుకుపడ్డారు. ‘ నితీశ్ మా కుటుంబాన్ని విమర్శించారు. ఆయన మోదీనీ విమర్శించినట్లే. మోదీకి కూడా తోబుట్టువులున్నారు. నితీశ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మహిళలను కించపరుస్తున్నారు. మా అమ్మ సంవేదనపై దెబ్బ కొట్టారు. అవినీతి, నిరుద్యోగిత లాంటి ముఖ్యమైన అంశాలపై సీఎం నితీశ్ మాట్లాడర’ని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జరిగిన ఓ ర్యాలీలో నితీశ్ కుమార్ ప్రసంగించారు. ‘లాలూకు తొమ్మిది మంది సంతానం ఉన్నారని, తేజస్వీ, సూర్య ప్రతాప్ తో పాటు మరో ఏడుగురు కూతుళ్లు కూడా ఉన్నారు. కూతుళ్లను రాజకీయాల్లో ప్రోత్సహించకుండా కేవలం కుమారులను మాత్రమే లాలూ ప్రోత్సహించారు. లాలూకు కూతుళ్లపై ఏమాత్రం నమ్మకం లేదు. ఏడుగురు కూతుళ్ల తర్వాత ఇద్దరు కుమారులు జన్మించారు. ఎలాంటి బిహార్ కావాలో మీరే తేల్చుకోవాల’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos