నిర్భయ దోషికి క్షమాభిక్ష వద్దు

నిర్భయ దోషికి క్షమాభిక్ష వద్దు

న్యూ ఢిల్లీ: నిర్భయ హత్యోదంతం కేసులో దోషి వినయశర్మకు క్షమాభిక్ష నిరాకరించాలని కేంద్ర హోం శాఖ శుక్రవారం రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కు సిఫార్సు చేసింది. వినయ్ శర్మ కోరిన క్షమా భిక్షను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. అనంతరం ఆ పిటిషన్ కేంద్ర హోం శాఖను చేరింది. తాజాగా వినయ్ శర్మ అభ్యర్థనను హోంశాఖ రాష్ట్రపతికి పంపింది. దరిమిలా క్షమాభిక్షను తిరస్కరించాలని సిఫార్సు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వినయ్ శర్మతో పాటు దోషులుగా తేలిన మరో ముగ్గురికి సర్వోన్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో బంధీలుగా ఉన్నారు. వీరిలో వినయ్ శర్మ క్షమాభిక్షను ఆశించగా మిగతా ముగ్గురు అందుకు దరఖాస్తు చేసుకోలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos