ఐపీల్ లో కొత్త జట్టు !

ఐపీల్ లో కొత్త జట్టు !

ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్ లపైకి 13 వ సీజన్ ఎన్నో సంచలనాలకు అంతకు మించిన వినోదానికి,ఉత్కంఠతకు వేదికగా నిలిచింది.ఈ సీజన్ ముగిసిందో లేదో అప్పుడే తర్వాత సీజన్ పై అంచనాలు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి లో ఐపీఎల్ 2021 నిర్వహిస్తామని.. అదికూడా భారత్ లోనే ఉంటుందని ఇప్పటికే బీసీసీఐ చీఫ్ సౌరవ్గంగూలీ ప్రకటించారు. అయితే వచ్చేఏడాది మరో కొత్తజట్టు ఐపీఎల్లో చేరనున్నట్టు టాక్. ఈ ప్రాంచైజీ కోసం ప్రముఖ ఆన్లైన్ క్లాసుల సంస్థ బైజుస్ తో కలిసి మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ బిడ్ దాఖలు చేసినట్లు టాక్.హ్మదాబాద్ లేదా కేరళ రాష్ట్రాల తరఫున ఆడే జట్టుకు మోహన్లాల్ ఓనర్గా వ్యవహరించనున్నాడట. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం రాలేదు.. అనధికారికంగా వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా వచ్చిన నష్టాన్ని పూడ్చేందుకు బీసీసీఐ కొత్త జట్టును తీసుకురానుందని ప్రచారం జరుగుతోంది. కొత్త ఫ్రాంచైజీ రాకతో పూర్తి స్థాయిలో మెగా వేలాన్ని నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్నద్ధం అవుతోందట.ఈ మేరకు ఇప్పటికే ఫ్రాంచైజీల కు ఓ ఇండికేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రతీ సీజన్ వేలం డిసెంబర్ లోనే జరుగుతుంది కానీ ఈ సారి మాత్రం వచ్చే ఏడాది ఆరంభంలో పూర్తి స్థాయిలో వేలం జరగనుందని సమాచారం. స్టార్ ఆటగాళ్లు కూడా వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు మోహన్ లాల్ హాజరయ్యారు. వాస్తవానికి ఈ సీజన్ లో ప్రేక్షకులకు అనుమతి లేదు. కానీ మోహన్ లాల్ రావడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. మోహన్ లాల్ రావడంతో కొత్త ఫ్రాంచైజీ కోసమే వచ్చారని బైజుస్ తో కలిసి కొత్త ఫ్రాంచైజీ కోసం బిడ్ కూడా దాఖలు చేశారని ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos