అమరావతి: నవ్యాంధ్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని గురువారం బాధ్యతల్నిచేపట్టారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నుంచి సాహ్ని బాధ్యతల్ని స్వీకరించారు. ఇప్పటివరకూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. కృష్ణాజిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా, నల్లగొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిం చిన, అనంతరం కేంద్ర సేవలకు వెళ్లారు. గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా, ఏపీఐడీసీ వీసీ అండ్ ఎండీగా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగానూ పని చేశారు.