ఎన్ డి ఏ ఓట్లకు గండి

ఎన్ డి ఏ ఓట్లకు గండి

పాట్నా: ఎన్డీయేతో పొత్తు తెంచుకున్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)ని ‘ఓట్లు చీల్చే పార్టీ’గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, భాజపా నేత సుశీల్ కుమార్ మోదీ అభివర్ణించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘మేము ఇస్తామన్న సీట్లు కంటే ఎల్జేపీ ఎక్కువ సీట్లు అడిగింది. దాంతో వ్యవహారం చెడింది. ఎన్డీయేను వీడకుండా ఎందుకు ఆపలేకపోయారని కొందరు ఎల్జేపీ నేతలు ప్రధాని మోదీ, అమిత్షా ప్రశ్నిస్తున్నారు. అమిత్షాను, ప్రధాని మోదీని ప్రశ్నించడానికి వాళ్లెవరు? నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎల్జేపీ వ్యతిరేకిస్తోందంటే వాళ్లు మోదీకి, షాకి కూడా వ్యతిరేకులే. ఒక వైపు మోదీని ఎల్జేపీ ప్రశంసిస్తూనే మరోవైపు నితీష్ కుమార్ను వ్యతిరేకించడం ఏమిటి? ఎన్డీయే నుంచి బైటకు వచ్చిన ఎల్జేపీ ఈ ఎన్నికల్లో జేడీయూ పోటీ చేసే చోట్ల తమ అభ్యర్థులను నిలబెడుతోంద’ని మండి పడ్డారు. మొదటి విడత ఎన్నికల్లో 27 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. 243 సీట్ల బీహార్ శాసనసభకు అక్టోబర్ 28, నవంబర్ 3, 7 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 10న ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos