విమర్శించిన వారిపైనే డ్రగ్స్‌ కేసులు

విమర్శించిన వారిపైనే డ్రగ్స్‌ కేసులు

ముంబయి: భాజపా విమర్శించిన వారిపై ఉద్దేశపూర్వకంగా, కక్ష పూరితంగా మాదక ద్రవ్యాల కేసులు బనాయిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన, నటి నగ్మా విమర్శించారు. అనురాగ్కశ్యప్, దియామీర్జా, దీపికాపడుకొనె భాజపాకు వ్యతిరేకంగా గతంలో మాట్లాడినందునే ఇప్పుడు వారిని పాలకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ట్విట్టర్లో దుయ్యబట్టారు. బాలీవుడ్ కథానాయికల ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఎన్సిబి మోసపూరితంగా వారి పేర్లను మాధ్యమాలకు లోపాయి కారిగా విడుదల చేసిందని ధ్వజమెత్తారు. మాదర ద్రవ్యాల్ని వినియోగిస్తున్నారంటూ దీపికా పడుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్సింగ్లకు ఎన్సిబి అధికారు తాఖీదుల్ని జారీ చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos