నాగార్జున కొండకు తిరిగి లాంచీ

నాగార్జున కొండకు తిరిగి లాంచీ

నాగార్జున కొండ ; ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండ కు రెండున్నరేళ్ల విరామం తరువాత లాంచీ సర్వీసులను పర్యాటకశాఖ తిరిగి ప్రారంభించింది. భద్రతా కారణాలు, కరోనా వల్ల లాంచీలు ఆగి పోయాయి. ప్రభుత్వ అనుమతులు రావడంతో తిరిగి పయనమయ్యాయి. గుంటూరు జిల్లా విజయపురి సౌత్లోని లాంచీ కేంద్రం నుంచి ఎట్టకేలకు పర్యాటకులతో నాగసిరి లాంచీ పయనమైంది. చుట్టూ కొండల నడుమ నదీ విహారం చేస్తూ పర్యాటకులు ఆనందంతో కేరింతలు కొట్టారు. నాగార్జున కొండలో ఉన్న సింహళ విహార, మహా స్తూపం, శ్రీ చైత్యం, అశ్వమేధ యాగశాల, స్నాన ఘట్టం, మ్యూజియంలోని బుద్ధుడి విగ్రహం, రాతి పనిముట్లు, మట్టి కుండలను తిలకించారు. పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని లాంచీ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రతీ పర్యాటకుడు లైఫ్ జాకెట్లు ధరించేలా చూస్తున్నామన్నారు. నాగార్జున కొండను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సందర్శించారు. ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన బుద్ధుడి పర్యాటక ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos