కరోనా ఆంక్షల నడుమ దసరా ఉత్సవాలు

కరోనా ఆంక్షల నడుమ దసరా ఉత్సవాలు

మైసూర్: దసరా ఉత్సవాలు శని వారం చాముండి కొండపై అమ్మవారి ని అర్చించటం ద్వారా ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు డాక్టర్ మంజునాథ్ లాంఛనంగా ఆరంభించారు. ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా పోరులో ముందుండి విశేష సేవలందించిన మరో ఆరుగురినీ సన్మానించారు. కరోనా వల్ల 410వ దసరా ఉత్సవాలను నిరాడంబరంగా, సంప్రదాయాలను పాటించేలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26 విజయ దశమి పర్వ దినాన చాముండేశ్వరి అమ్మవారి జంబో సవారీ -ఏనుగుపై ఊరేగింపు నిర్వహిస్తారు.

తాజా సమాచారం