కశ్మీర్‌ శాసనసభకు త్వరలోనే ఎన్నికలు

కశ్మీర్‌ శాసనసభకు త్వరలోనే ఎన్నికలు

శ్రీనగర్: జమ్మూ- కశ్మీర్ శాసనసభ ఎన్నికల్ని కేంద్రం నిర్వహించ దలుస్తోంది. దీని గురించి కశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ గిరీశ్ చందర్ ముర్ము గురు వారం ఇక్కడ జరిగిన అధికారులతో సమావేశంలో విషయాన్ని ప్రస్తావించారు. ‘కశ్మీర్ శాసన సభకు ఎన్నికలు నిర్వహించేందకు కేంద్రం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి. అందుకు ఇక్కడి యంత్రాం గం, పౌరులంతా సహకరించాలి. జమ్మూ కశ్మీర్ వ్యవహారాలను ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నేరుగా పరిశీలిస్తోంది. ఎన్నికల వేళ ల్ని కేంద్రమే త్వరలో ప్రకటించ నుంద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos