కర్నూలు: గడివేముల మండలం పెసరవాయిలో ఇద్దరు తెదేపా నాయకులు గురువారం పెసరవాయి మాజీ సర్పంచ్ వడ్డు నాగేశ్వర్రెడ్డి, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు వడ్డు ప్రతాప్రెడ్డి హత్యకు గురయ్యారు. వారిద్దరూ అన్నదమ్ములు. ప్రత్యర్థులు వాహనంతో ఢీకొట్టించి చంపారు. మృతులు స్మశానవాటిక నుంచి తిరిగి వస్తున్న పుడు సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైకాపా నాయకులే వాహనంతో ఢీకొట్టి చంపినట్లు బంధువుల ఆరోపించారు.