కరోనా భయంతో తమ్ముడ్ని చంపేసిన అన్న..

కరోనా భయంతో తమ్ముడ్ని చంపేసిన అన్న..

దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ వేళ ఇంట్లో నుంచి అదేపనిగా బయటకు వెళ్లోద్దని అన్న,వదినలు వారించినా వినలేదని అన్న సొంత తమ్ముడిని హత్యా చేశాడు.మహారాష్ట్ర రాజధాని ముంబయికి చెందిన దుర్గేశ్ పూణెలోని ప్రైవేటు కంపెనీలో పని చేసేవాడు కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ విధించడంతో అంత ఇంట్లోనే ఉండసాగారు అయితే అన్న ఇంట్లో ఉంటున్నదుర్గేశ్ లాక్ డౌన్ నిబంధనల్ని పట్టించుకోకుండా బయటకు వెళ్లటాన్ని అన్న వదినలు తప్పు పట్టేవారు. అదే పనిగా బయటకు వెళ్లి వస్తే.వైరస్ సోకి అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించాడు।ఈ క్రమంలో అన్నా తమ్ముళ్ల మధ్య మొదలైన మాటలు కాసేపటికే భౌతిక దాడులు చేసుకునే వరకూ వెళ్లింది.దీంతో విపరీతమైన ఆగ్రహంతో ఉన్న అన్న కోపంతో తమ్ముడిని కొట్టటం ఆ క్రమంలో అతడు మరణించాడు. ఈ ఉదంతానికి సంబంధించిన సమాచారం పోలీసులకు అందటంతో దుర్గేశ్ సోదరుడు రాజేశ్ ఠాకూర్ ను అదుపులోకి తీసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos