పేద విద్యార్థినికి కె.పి.ఎం. ఆర్థిక సాయం

పేద విద్యార్థినికి కె.పి.ఎం. ఆర్థిక సాయం

హోసూరు : ప్రభుత్వ కోటా కింద మెడికల్ సీటు పొందిన పేద విద్యార్థినికి రాజ్యసభ సభ్యుడు కె.పి. మునిస్వామి రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. హోసూరు బస్తి ప్రాంతానికి చెందిన శ్వేత అనే పేద విద్యార్థినికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ కోటాలో మెడికల్ సీటు లభించింది. శ్వేతా తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ ముగ్గురు కుమార్తెలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేవాడు. చదువులో ముందున్న శ్వేతకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మెడికల్ సీటు కేటాయించారు. ఆర్థికంగా వెనుకబడిన శ్వేతను ఆదుకోవడానికి కె.పి.మునిస్వామి రూ.50 వేల నగదును అందించారు. ఎడిఎంకె పార్టీ హోసూరు పట్టణ కార్యదర్శి పాల్ నారాయణ చేతుల మీదుగా విద్యార్థిని శ్వేతకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎడిఎంకె పార్టీ నాయకులు బారందురు శేఖర్, విశ్వనాథ రెడ్డి, సుబ్రమణి, బాగ లూరు పంచాయితీ అధ్యక్షులు విడి.జయరాం తదితరులు ఆయన వెంట ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos