హోసూరులో మొబైల్ రేషన్ షాపు

హోసూరులో మొబైల్ రేషన్ షాపు

హోసూరు : మొట్టమొదట మొబైల్ రేషన్ షాపును హోసూరు యూనియన్ చైర్‌పర్సన్ శశి వెంకటస్వామి ప్రారంభించారు. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల ద్వారా సంచార రేషన్ షాపులను ప్రారంభించింది. తద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా నిత్యావసర వస్తువులను పంపింణీ చేయడానికి చర్యలు చేపట్టింది. అందులోభాగంగా హోసూరు ప్రాంతంలో సంచార రేషన్ షాపును ప్రారంభించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. హోసూరు యూనియన్ గోపనపల్లి పంచాయతీలోని గూలి సంద్రం గ్రామంలో సంచార రేషన్ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  హోసూరు యూనియన్ చైర్‌పర్సన్ శశి వెంకటస్వామి సంచార రేషన్ షాపును ప్రారంభించి లబ్ధిదారులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపనపల్లి పంచాయతీ సర్పంచ్ గీతా శంకర్, ఎడిఎంకె పార్టీ యూనియన్ కార్యదర్శి హరీష్ రెడ్డి, వైస్ చైర్మన్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos