దివాలా తీసిన శ్రీమంతుడు

దివాలా తీసిన శ్రీమంతుడు

లండన్ : జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. శ్రీమంతులు బజారున పడొచ్చు.. సామాన్యుడు అందలానికి ఎక్కొచ్చు. ఇలాంటి మరో ఘటనే ఇప్పుడు సంభ వించింది. ప్రపంచంలోని శ్రీమంతుల్లో ఒక్కరైన లక్ష్మీ మిట్టల్ సోదరురు ప్రమోద్ మిట్టల్ దివాలా తీశాడు. స్థానిక వ్యాపార వేత్త వేలాది కోట్ల అప్పుల్లో కూరుకుపోయారు. 2013లో దాదాపు రూ. 500 కోట్లు వ్యయం చేసి తన కూతురు వివాహాన్ని జరిపించాడు. జనాలంతా ఆశ్చర్యపోయారు. 2006లో బోస్నియన్ కోక్ తయారీ కంపెనీ జీఐకేఐఎల్ రుణాలకు తన గ్లోబల్ స్టీల్ హోల్డింగ్ తరపున హామీ సంతకం పెట్టారు. జీఐకేఐఎల్ సంస్థ రుణాలను చెల్లించలేకపోయింది. దీంతో, అప్పులు ఇచ్చిన మార్గెట్ కంపెనీ 166 మిలియన్ డాలర్లను చెల్లించాలంటూ మిట్టల్ ను కోర్టుకు లాగింది. ఇంత మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో దివాళా తీశారు. రూ పాతిక వేల కోట్ల రుణాలు తేలాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos