న్యూఢిల్లీ: జాతీయ పౌరసత్వ చట్ట సవరణ ముసాయిదా మైనార్టీలకు, సమానత్వ హక్కుకు వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి సోమవారం లోక్సభలో వ్యాఖ్యానించారు. ‘దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు రాజ్యాంగం ప్రజలకు కల్పించింది. దేశ లౌకిక వాదానికి, సమగ్రతకు ఇది విఘాతం కలిగిస్తుంద’న్నారు. ‘మహాత్ముల ఆశయాలకు ఈ ముసాయిదా తూట్లు పొడుస్తుంది. రాజ్యాంగ ప్రవేశికకు ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకంగా వుంద’ని మరో కాంగ్రెస్ సభ్యుడు శశి థరూర్ విమర్శిం చారు.