మాయావతికి భారీ దెబ్బ

మాయావతికి భారీ దెబ్బ

లక్నో: బీఎస్పీ తిరుగుబాటు శాసనసభ్యులు సమాజవాది పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆ పార్టీ అధినేత మాయావతికి ఇది భారీ దెబ్బ. ఎమ్మెల్యేలు హకీమ్ లాల్ బింద్ (హండియా), వందన సింగ్ (సాగ్రి), రామ్వీర్ ఉపాధ్యాయ (సదాబాద్), అనిల్ కుమార్ సింగ్ (పూర్వా), అస్లాం రైనీ (భింగా), అస్లాం అలీ (ధోలానా), ముజ్తాబా సిద్దిఖీ (ప్రతాపూర్), హర్గోవింద్ భార్గవ సిధౌలి) సుష్మా పటేల్ (ముంగ్రా బాద్షాపూర్)సమాజవాది పార్టీ అఖిలేష్ను మంగళవారం కలిశారు. త్వరలోనే వీరంతా సమాజ్ వాదీ పార్టీకి మారవచ్చనే వాదనలు ఊపందుకున్నాయి. 2017 ఎన్నికల్లో బీఎస్పీ19 సీట్లు గెలుచుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos