పారిశుధ్య కార్మికులకు మాస్కులు

పారిశుధ్య కార్మికులకు మాస్కులు

హొసూరు : కరోనా వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేది వరకు రాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్‌ విధించింది. అందులోభాగంగా హొసూరు పట్టణం నిర్మానుష్యంగా మారింది. అందరూ ఇళ్లకే పరిమితమైనా, పారిశుధ్య కార్మికులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. కార్మికుల్లో కొందరు మాస్కులు లేకుండానే విధులు నిర్వహిస్తున్నందున, పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి కార్మికులకు మాస్కులను ఉచితంగా పంపిణీ చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos