ఐదుగురు మావోయిస్టుల మృతి

ఐదుగురు మావోయిస్టుల మృతి

గడ్చిరోలి: గడ్చిరోలి జిల్లాలోని గైరపట్టిలో కొసమి-కిసనెల్లి సమీపంలోని అడవుల్లో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు. కొందరు మావోయిస్టులు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీ60 కమాండోలు ఆదివారం గాలింపుల్ని చేపట్టాయి. దీంతో మావోయిస్టులు కాల్పులకు దిగినట్లు చెప్పారు. పర్యవసానంగా తాము జరిపిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలిస్తున్నామన్నారు. మృత దేహాలను పరీక్ష కోసం హెలి కాప్టరు ద్వారా గడ్చిరోలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos